Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్పు చేసిన రేవంత్ సర్కార్ తొలుత ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలుత శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్భార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పించారు.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వారానికి రెండు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మంగళ, శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజాపాలన అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రజా దర్భార్ ను ఇక పై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళలు, వికలాంగులకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యం గా తాగునీరు, ఇతర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు సీఎం రేవంత్.
కాగా మంగళవారం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజావాణికి హజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అంటున్నారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
IPS Anjani Kumar: సీనియర్ ఐపీఎస్ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన ఈసీ