IPS Anjani Kumar: తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్ పై విధించిన సస్పెన్షన్ ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర డీజీపీ గా ఉన్న అంజనీ కుమార్.. ఫలితాలు వెల్లడి అవుతున్న సమయంలోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీ సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన ఈసీకి వివరణ ఇచ్చారు.
ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి కబురు చేస్తేనే వెళ్లాననీ, మరో సారి ఇలా జరగదని అంజనీకుమార్ ఈసీకి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ..ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో డీజీపీగా అంజనీ కుమార్ ను కొనసాగిస్తారా .. వేరే అధికారిని ప్రభుత్వం నియమిస్తుందా అనేది వేచి చూడాలి.
YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. నియోజకవర్గాల్లో చిచ్చు రేపిన కొత్త ఇన్ చార్జ్ ల నియాకమం