Komatireddy Venkat Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పక్కన పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని చెప్పేంది. ఈ తరుణంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా గత ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఏపీని ఆదుకోవాలని పార్లమెంట్ లో ఇచ్చిన హామీ అది అని పేర్కొన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలు పర్చకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేశారనీ, ప్రస్తుత ప్రధాని దానిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఏపీ భవన్ కు చెందిన ఆస్తులను పరిశీలించానని పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి .. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ వివరాలను సీఎంకు వివరిస్తానని చెప్పారు. ఇప్పటికే నిర్మాణం ఆలస్యం అయ్యిందని అన్నారు. ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మద్య ఎలాంటి వివాదం లేదని మంత్రి చెప్పారు. ఉమ్మడి ఏపీ భవన్ లో పలు బ్లాక్ లను మంత్రి పరిశీలించారు. ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలు, రాష్ట్ర వాటాను అధికారులు మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. అనంతరం తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని కోమటిరెడ్డి పరిశీలించారు.
Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. ప్రజావాణి ఇక వారానికి రెండు రోజులు