తెలంగాణ లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో కృష్ణా, గోదావరి నదుుల ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం, శుక్రవారం జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది. షెడ్యుల్ ప్రకారం ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకూ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఉన్నత విద్యామండలి. కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున గ్రామీణ ప్రాంత విద్యార్ధులు పరీక్షలకు హజరయ్యేందుకు అవకాశం ఉండదని విద్యార్ధి సంఘాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
బ్రేకింగ్: శ్రీలంక లో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే