Brahmamudi: సాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమాలకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ లకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సినిమా హీరోలు నేషనల్ అవార్డు గెలుచుకుంటే తమ ఫ్యాన్స్ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారో.. సీరియల్ నటీనటులు ఏదైనా అవార్డు గెలుచుకుంటే అంతే ఆనందిస్తారు ప్రేక్షకులు.
ఇక మన బుల్లితెరపై సందడి చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కార్తీకదీపం అనంతరం బెస్ట్ సీరియల్ గా నిలిచింది బ్రహ్మముడి. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఇక ఈ సీరియల్ టయానికి ఆడవారు ఎక్కడున్నా టీవీ ముందు వాలిపోతారు. అంతటి పాపులర్ అయ్యింది ఈ సీరియల్.
ఇక ఇందులో భార్య భర్తలు గా నటిస్తున్న రాజ్ మరియు కావ్యాలకి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కావ్య అసలు పేరు దీపిక. ఈ ముద్దుగుమ్మ ఈ సీరియల్ ద్వారానే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక వీరికి గత ఏడాది ప్రత్యేకమైన సన్మానం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా సన్మానానికి అర్హులు అయ్యారు ఈ సీరియల్ టీం.
బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న బ్రహ్మముడి సీరియల్ నుంచి.. మానస్, దీపిక, హమీద, షణ్ముఖ ప్రియా నీప, మాధురి, ఆర్ గిరీష్ శంకర్, డైరెక్టర్ కుమార్ పట్నంలను ప్రత్యేకంగా శిల్పకళ వేదిక హైదరాబాద్ లో నేడు ప్రత్యేకంగా సన్మానం చేస్తున్నారు. మాటీవీలో ఎన్ని సీరియల్లు ప్రసారమైనప్పటికీ బ్రహ్మముడికి మాత్రమే దక్కింది. ఈ ప్రత్యేక సన్మానం నిజంగా హ్యాట్సాఫ్ అని చెప్పుకోవచ్చు.