Nindu Noorella Savasam: జీ తెలుగులో ప్రసారమవుతూ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో పోషిస్తున్న అరుంధతి అలియాస్ పల్లవి గౌడ మనందరికీ సుపరిచితమే. ఈమె ఓ కన్నడ యాక్టర్. 1993లో బెంగళూరులో జన్మించింది పల్లవి గౌడ. అదేవిధంగా స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా పసుపు కుంకుమ సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే అనంతరం కొన్ని కారణాల చేత ఈమెని తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు.
దాంతో కొన్ని సంవత్సరాలు పూర్తిగా కన్నడ మరియు మలయాళం సీరియల్లో నటించింది. ఈమె కన్నడలో ఐదుకు పైగా సీరియల్స్ తో పాటు పలు మలయాల్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె బ్యాన్ చేసిన గడువు, ముగిసిన అనంతరం చదరంగం సీరియల్తో మరోసారి తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో అరుంధతి పాత్ర పోషిస్తుంది. నిజానికి పల్లవి గౌడ అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరు. కానీ పోనీలే అని ఈమె సీరియల్స్ తో అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా ఈమెకి అనేక అవమానాలు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే ఒకసారి తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి బ్యాన్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో తనని బ్యాన్ చేయడం విషయంలో పల్లవి గౌడ స్పందిస్తూ..” నేను నా సెకండ్ సీరియల్ చేస్తున్నప్పుడు నాకు మూవీ షూటింగ్ ఉంది. ఇక నాకు ఇచ్చిన అగ్రిమెంట్లో .. ఈ సీరియల్ కంప్లీట్ అయ్యే వరకు వేరే ఏ సీరియల్ చేయకూడదు అని ఉంది. ఓకే అని నేను దానికి ఒప్పుకుని ఆ సీరియల్ లో నటించా. కానీ ఆ సీరియల్ నుంచి నాకు రెండు నెలల వరకు జీతం ఇవ్వలేదు. అప్పుడు నేను మీరెలాగో పేమెంట్ ఇవ్వడం లేదు నేను వేరే సీరియల్ అయినా చేస్తాను అని చెప్పాను.
కానీ అప్పుడు ఆ డైరెక్టర్ మీరు ఒకసారి సైన్ పెట్టారు కదా అలా కుదరదు అని చెప్పాడు. ఇక ఆ తరువాత నన్ను తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మా మధ్య జరిగిన ఆ చిన్న గొడవ కాస్త కోల్డ్ వార్ గా మారింది. అనంతరం నాకు ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి చెప్పే వరకు నన్ను బ్యాన్ చేశారని నాకు తెలియదు ” అంటూ చెప్పుకొచ్చింది పల్లవి గౌడ. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మని మరోసారి తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.