IPL: గత కొన్ని రోజుల క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు తాజాగా రద్దయ్యాయి. పలు జట్ల ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో bcci ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు ఒక జట్టు ఆటగాడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే మొత్తం టీం ఐసోలేషన్ లోకి వెళ్లే పరిస్థితి ఉండటంతో.. 2021 ఐపీఎల్ సీజన్ నీ వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండటంతో..విదేశీ ఆటగాళ్లు విషయంలో ఆయా దేశాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరోపక్క మొదటి నుండి ఐపీఎల్ మ్యాచ్ లు..ఆపేయాలని దేశంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు కోరడం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా Bcci మొత్తం సీజన్ మ్యాచ్లను నిరవధికంగా వాయిదా వేయటంతో ఈ వార్తా క్రీడారంగంలో సెన్సేషనల్ గా మారింది.