Burugu: సాధారణంగా ప్రస్తుత కాలంలో గిరిజనులు అయినప్పటికీ వారికి తగిన సదుపాయాలు కలిగేలా చూసుకుంటున్నారు గవర్నమెంట్. కానీ కొన్ని కొన్నిచోట్ల మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. అలా కాంతి లేని ఊరు ఒకటి ఉంది. అదే బూరుగు గ్రామం. ఈ బూరుగు గ్రామం తూర్పు కనుముల్లో ఉన్న విద్యుత్ కాంతులు తెలియని వారిలో ఈ గ్రామం ప్రజలు ఒకరు.
ఈ గ్రామంలో చీకటి అయ్యింది అంటే పెద్దలు మరియు పిల్లలు, ప్రెగ్నెంట్స్ అందరూ కూడా చీకట్లో బ్రతకాల్సిందే. రాత్రి వేళల్లో వీరు ఉన్నారు అని సూచించే కాంతి పొయ్యి వెలుగు మరియు ఊరు మొత్తంలో ఉన్న నాలుగు మొబైల్స్. రాత్రి పాటు వీటి సాయంతోనే అక్కడున్న స్థానికులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర ఉన్న నాలుగు ఫోన్స్ కి మరియు టార్చ్ లైట్స్ కి చార్జింగ్ పెట్టేందుకు 20 కిలోమీటర్ల వరకు వెళ్లాలి.
ఇక ఈ చీకటి లోనే ఒక ప్రెగ్నెంట్ ఆవిడ కూడా జీవిస్తుంది. ఇక ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమె భర్త టార్చ్ లైట్ ను తీసుకున్నాడట. ఇక ఆమె చాలా కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇక అక్కడ ఉన్న చిన్నారులు సైతం ఆ పోయి వెలుగులోనే చదువుకోవాల్సిన స్థితి పట్టింది. అదేవిధంగా అక్కడ ఉన్నవారు తమ ఊర్లోకి చేరుకోవాలన్న ఏదో ఒక మంట కర్రను పట్టుకుని చేరుకోవాల్సిన స్థితి పట్టింది.
ఇక వారు గవర్నమెంట్ ని ఎన్నో ఏళ్లుగా తమ ఊరికి కరెంట్ ఇవ్వమని కోరుతున్నప్పటికీ గవర్నమెంట్ ఆ ఊరిని అస్సలు పట్టించుకోవడం లేదు. తమ గ్రామంలో కరెంట్ ఇవ్వకపోయినా ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నట్లు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ తమ పైన కనికరం చూపించి తమకి విద్యుత్ సరఫరా ఇవ్వమని కోరుతున్నారు.