భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ శుభ్రత తో ముడిపడి ఉంటుంది అన్నది ఎంతో మంది ఆరోగ్య నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఇక భారతదేశంలో మురికి కాలువలకు, డ్రైనేజీ లు పారే రోడ్లు, వీధి చివర్లలో పేరుకుపోయిన చెత్త కుప్పలు ఎప్పుడూ ఉండేవే. అయినా కానీ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్’ నిర్మాణం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వాటిలో కొన్ని నగరాల్లోని మునిసిపాలిటీ సిబ్బంది పనితీరుని మెచ్చుకోకతప్పదు.
అలాంటి నగరాల లిస్ట్ బయటికి తీస్తే…. వాటిలో ఒక్కో సిటీకి వాటిలో ఉండే శుభ్రత గమనాన్ని బట్టి ఒక్కో ర్యాంకింగ్ ఇచ్చారు. ప్రతియేటా ర్యాంకింగ్ విడుదలచేసే స్వచ్ఛ సర్వేక్షన్…. 2020 సంవత్సరంలో కూడా ఈ ర్యాంకింగ్ లను విడుదల చేసింది. ఇక మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండోర్ సిటీ వరుసగా నాలుగోసారి కూడా భారతదేశపు పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఇలా వరుసగా ఇన్నిసార్లు ఒక సిటీ ఈ ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం నిజంగా గొప్ప విషయం.
ఈ లిస్టు ద్వారా ఇలా ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టిన మొదటి సంవత్సరంలో మైసూరు స్వచ్ఛమైన నగరంగా రికార్డు సాధించగా… ఇండోర్ 2017, 2018, 2019, 2020 సంవత్సరాలలో ఇండోర్ వరుసగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అక్టోబర్ 2, 2014 సంవత్సరంలో మహాత్మాగాంధీ 150 వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ దీనిని ప్రారంభించారు.
ఇక ఇండోర్ తర్వాత సూరత్ నేవీ, ముంబై, విజయవాడ, అహ్మదాబాద్, రాజ్ కోట్, భోపాల్, చండీఘర్, విశాఖపట్నం, వడోదర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడ 5వ స్థానంలో నిలవగా… విశాఖపట్నం పదవ స్థానంలో నిలిచింది. ఇక 100 అర్బన్ లోకల్ బాడీస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండే రాష్ట్రాల్లో శుభ్రత ప్రమాణాలను పరిశీలిస్తే మొదటి స్థానంలో చత్తీస్ ఘర్ రాష్ట్రం నిలిచింది. రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది.