తమ ఖాతాదులందరికీ మేలైన అన్ని రకాల సర్వీలను అందిస్తూ అందరిచేత మెప్పించుకుంటున్న బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మరో శుభవార్తను అందించింది. ఇప్పటికే ఈ బ్యాంక్ తన కస్టమర్ల కోసం బ్యాంక్ అకౌంట్ తీయడం నుంచి ఏటీఎం వరకు ఎన్నో సర్వీసులను అందించిన సంగతి తెలిసిందే..
కాగా తాజాగా ప్రీ అప్రూవ్డ్ రుణాలను ఆఫర్ చేస్తూ కస్టమర్లను షాకింగ్ కు గురిచేసింది. లోన్ గురించి చింతించే వారు ఎవరైనా ఉన్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఎస్ బీఐ ని సంప్రదించి మీ కలను సాకారం చేసుకోండి. ఈ రుణం ద్వారా రూ. 5 లక్షల రుణం పొందవచ్చును . అలాగే 6 నెలలు ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదండోయ్..
ఎస్బీఐ ఎన్నో రకాల లోన్లను తమ కస్టమర్ల కోసం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అతి తక్కువ వడ్డీకే రూ. 5 లక్షల వరకు రుణాలను అందించడానికి సిద్ధమైంది. అలాగే యోనో యాప్ ద్వారా ఈ రుణాలను 45 నిమిషాల్లోనే పొందే అవకాశం కూడా కల్పించింది. ఈ రుణాలపై 10.5 శాతం వడ్డీ రుటు ఉంది.
దీనిలో భాగంగా సాధారణ ఖాతాదారులు రూ. 2 లక్షల వరకు లోన్ పొందే అవకాశముంది. పెన్షన్ దారులైతే రూ. 2.5 లక్షలు పొందవచ్చు. అలాగే సర్వీస్ క్లాస్ వారు రూ. 5 లక్షల దాకా రుణం పొందవచ్చు. ఈ రుణం కేవలం యోనో యాప్ లో అర్హత ఉన్నవారికి ఈ ఆఫర్ కనిపిస్తుంది. ఈ రుణం గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే వారు పీఏపీఎల్ అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలను టైప్ చేసి 567676కు మెసేజ్ చేయాలి. దీని వలన లోన్ గురించి పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు.