Mahesh Kathi pavan Kalyan : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.. అన్ని ప్రధాన పార్టీలు తిరుపతి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. అధికారిక వైయస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు భారతీయ జనతాపార్టీ – జనసేన కూటమి ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పులివెందుల గుండాలకు ఎంతకాలం భయపడతామని వారి దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటు పిలుపునిచ్చారు.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు మహేష్ కత్తి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు..
పులివెందుల అంటే పవన్ కళ్యాణ్ కు రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు గుర్తొస్తే తనకు మాత్రం మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లకు సినీ భిక్ష పెట్టిన బి.ఎన్ రెడ్డి, నాగిరెడ్డి గుర్తుకు వస్తారు అని చెప్పారు. ఎన్టీ రామారావు లాంటి మహా నాయకుడు కూడా పులివెందుల అంటే వాళ్ళిద్దరే గుర్తుకు వస్తారు అని అన్నారు. అందుకే తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన 9నెలల్లోనే ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు అని చెప్పారు.. పవన్ కళ్యాణ్ ఉట్టికి, ఆకాశానికి మధ్య ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. అది ఆయన కర్మ, ఖర్మ అంటూ ఎద్దేవా చేశారు.. మాదిగ సామాజిక రాజకీయ చిత్తూరు జిల్లాలో రాజకీయ వివక్ష ఉందని మహేష్ కత్తి అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టకపోతే బీజేపీ కొంత లాభం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.