Oneplus: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ యాపిల్ లేదా వన్ ప్లస్ ఫోన్స్ పై ఎక్కువ గా ఆసక్తి చూపిస్తున్నారు. బాగా ధనవంతులు అయితే యాపిల్ ఫోన్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే వన్ ప్లస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన భారత్ మార్కెట్లో వన్ ప్లస్ రేంజ్ మామూలుగా ఉండదనే చెప్పొచ్చు.
ఇక వన్ ప్లస్ ఇటీవలే ప్రతి ఒక కొనుగోలుదారుడు బడ్జెట్ ధరలో ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంది. ఇక ఈ తరుణంలోనే ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ రూ.15 వేలకే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇక ఇంత గొప్ప బ్రాండ్ నుంచి తక్కువ ధరకే ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు వీటిపై మక్కువ చూపిస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ ఎన్30ఎస్ ఈ పేరుతో ఈ ఫోను ఇండియాలో లాంచ్ చేయనున్నారు.
ఇక ఇప్పటికే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ యుఏఈ లో లంచ్ చేశారు. ఇక ఈ ఫోన్ భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వకపోయినా వీటిలో ఉండే ఫ్యూచర్స్ మరియు ధర గురించి క్లారిటీ ఇచ్చారు కంపెనీ అధికారులు. ఈ ఫోన్ నార్డ్ 3ఎస్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.72 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లేను ఇచ్చారు.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంతో ఇది వర్క్ అవుతుంది. అదేవిధంగా 2,400×1,080 పిక్సెల్స్ తో దీన్ని లాంచ్ చేయనున్నారు. డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ విత్ మాలి జీ57 ఎంసి2 జీపీయూతో పనిచేస్తుంది. అలాగే దీనికి డ్యూయల్ స్టూరియో స్పీకర్స్ తో పాటు 300% అల్ట్రా వ్యాక్యూమ్ మూడ్ను కూడా ఉంచారు. ఇక ఇన్ని ఫ్యూచర్లతో వస్తున్న ఈ ఫోన్ కేవలం రూ.15,000 మాత్రమే కావడం ప్రతి ఒక్క కొనుగోలు దారుడికి సంతోషాన్నిస్తుంది. ఇక ఈ ఫోన్ ఇండియాలో త్వరలోనే లాంచ్ కానుంది.