ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఆన్లైన్ గేమ్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఎక్కువమంది కంప్యూటర్లు, లాప్టాప్ లతో కూడా ఈ గేమ్స్ ని ఆడుతూ ఉన్నారు. ఇక మరికొందరు మాత్రం సెల్ ఫోన్స్ మరియు టీవీస్ లో ఆడుతూ ఉన్నారు. ఇక ఫోన్స్ లో ఆడేందుకు కొంతమందికి సరైన ఫోన్ లేకపోవడంతో చాలా చింతిస్తున్నారు.
ఇక వారి కోసమే ఓ స్పెషల్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. గేమింగ్ లవర్స్ కి బాగా ఉపయోగపడే ఫోన్ ఇది. సాధారణంగా గేమ్ యాప్స్ ఎక్కువగా ర్యామ్ తీసుకుంటాయి. సో గేమింగ్ ఫోన్లని వాడడం మంచిది. అలానే గేమ్స్ కూడా మంచిగా ప్లే చేయవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటేనే గేమ్స్ ఆడుకునేందుకు తగిన విధంగా ఉంటుంది. ఇక మార్కెట్లో గేమ్స్ కోసం స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేశారు.
అధిక రాం మరియు మంచి గ్రాఫిక్స్ ప్రొసెసర్ అలానే అధిక రిఫ్రెష్ రేట్.. రిజర్వేషన్ కలిగిన డిస్ప్లే మరియు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఫోన్ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఫోన్ మరేదో కాదు సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ 24 ప్లస్ 5 జి. అధిక నాణ్యత మరియు పనితీరు కలిగిన గేమింగ్ ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.
ఈ ఫోన్ కి క్యూహెచ్డీ ప్లస్ స్క్రీన్ రిజర్వేషన్ కలిగి ఉంది. అదేవిధంగా లాంగ్ లాస్టింగ్ బ్యాక్టరీని ఇచ్చారు. అలా గేమింగ్ ఆడుతూ ఉంటే 29 గంటల లైఫ్ ఇస్తుంది. కెమెరా కూడా అధిక నాణ్యత కలిగిన 50 ఎంపీ ఉంది. ఇక ధర విషయానికి వస్తే అక్షరాల రూ.1, 09,999 గా ఉంది. ఇక గేమింగ్ ఎక్కువగా ఆడేవారికి ఈ ఫోన్ తగిన విధంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఫొటోస్ కి కూడా బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కావడంతో గేమింగ్ లవర్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.