Sushmita Sen: కరోనా సెకెండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది.. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.. రోజుకు లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి కి బలవుతున్నారు.. కొన్ని హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరతతో రోజు వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీని వేగవంతం చేసింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితాసేన్ కరోనా రోగులకు అందించడానికి ముందుకు వచ్చింది.. ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసేందుకు నేను సిద్ధం అంటూ ట్వీట్ చేసింది.. ఇక ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు సుస్మితా పై ప్రశ్నల వర్షం కురిపించారు.. నెటిజన్ ట్రోల్స్ కు ఘాటుగా స్పందించిన సుస్మితాసేన్..
కరోనా మరణాల సంఖ్య పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల పాటు మినీ లాక్ డౌన్ విధించారు.. ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక వైపు కరోనా మరణమృదంగం మోగిస్తూండగా.. అక్కడి కాలుష్యానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ఇటీవల ఢిల్లీలోనీ శాంతి ముకుంద్ హాస్పటల్ సీఈవో సునీల్ సాగర్ ఒక ఇంటర్వ్యూలో హాస్పటల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని తెలిపారు.
ఆ వీడియో చూసిన సుస్మిత హృదయ విదారకమైన పరిస్థితి దేశంలో ఎక్కడ చూసినా అక్సిజన్ కొరత ఉంది. ఈ ఆసుపత్రికి కొన్ని ఆక్సిజన్ సిలిండర్ లను నేను అందించగలను. కానీ.. ముంబై నుంచి ఢిల్లీకి వాటిని ఎలా సరఫరా చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి నాకు కొంచెం సాయం చేయగలరు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్ సుస్మిత పై సెటైర్ వేసాడు. ఆక్సిజన్ కొరత అన్ని చోట్ల ఉన్నప్పుడు ముంబైలో ఉన్న ఆసుపత్రులకు సాయం అందించకుండా ఢిల్లీలోని ఆసుపత్రులకు ఎందుకు సాయం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దీంతో అసహనానికి గురైన సుస్మిత ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ముంబైలో అక్సిజన్ కొరత అంతగా లేదు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎన్నో ఆసుపత్రిలో ప్రాణవాయువు అవసరం ఉంది. ముఖ్యంగా చిన్న ఆసుపత్రులకు.. కాబట్టి మీరు సాయం చేయగలిగితే చేయండి అని ఆమె ఘాటుగా బదులు ఇచ్చారు.