Big Breaking: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొర కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది.
పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా ప్రయజనం కలుగుతుంది. మనిషికి రూ.5కేజీల చొప్పున అహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. తొలి దశలో అహార ధాన్యాల కోసం రూ.26వేల కోట్లు ఖర్చు చేయనున్నది. గత ఏడాది కరోనా సమయంలోనూ మార్చి నుండి అక్టోబర్ నెల వరకూ రేషన్ షాపుల ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేశారు.