ప్రముఖ కార్ల సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకొస్తోంది. సులభమైన ఈఎంఐల ద్వారా కొత్త కారు అన్ని వర్గాల వారు కొనుక్కునేలా పలు ఆప్షన్లు ఇస్తోంది. తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం, తక్కువ ఈఎంఐ, లోన్ మారిటోరియం.. వంటి ప్రయోజనాలను మారుతీ కస్టమర్స్ కోసం ప్రవేశపెట్టింది.
ఇందుకు మారుతీ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ తో టైఅప్ అయింది. యాక్సిస్ బ్యాంక్ ద్వారా కారు కొన్నవారికి సరికొత్త ఆఫర్లు ఇస్తోంది. కారు కొనుగోలు కోసం తీసుకున్న రుణంపై పలు లోన్ ఆప్షన్స్ ఇస్తోంది. ఈ రుణాన్ని కొనుగోలుదారులు 8ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ కల్పించింది మారుతీ కంపెనీ.
కంపెనీ పలు ఈఎంఐ ఆప్షన్లు కల్పించడం వల్ల కస్టమర్లకు తమకు అనువైన ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. లక్ష రూపాయలకు ఈఎంఐ 1250 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోన్ తీసుకున్న వారికి ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. తొలి మూడు ఈఎంఐలకు సంబంధించి నెలకు రూ.899 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఆఫర్లు జూలై 31వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉద్యోగస్థులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా మారుతీ సుజుకీ ఈ ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఈ పరిస్థితుల్లో కస్టమర్లు కార్లు కొనేందుకు.. సులభంగా రుణం పొందేందుకు ఈ అవకాశాలను కంపెనీ ప్రవేశపెట్టింది.