ఈ కరోనా సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్థికంగానే కాకుండా పాలనాపరంగా కూడా శర వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ మహమ్మారి అటు ప్రజలతో పాటు ఇటు పాలకులను కూడా ఇబ్బంది పెడుతోంది. ప్రతి రోజూ వేలసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నియంత్రణ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. అయితే ఎంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నా… దీని వ్యాప్తి తగ్గలేదు సరికదా రోజురోజుకీ రెట్టింపు అవుతోంది.
ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు
వివరాల్లోకి వెళితే… గత కొన్ని రోజులుగా చెన్నైలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చెన్నై నుండి రాజధానిని తరలించాలని డిమాండ్లు మొదలయ్యాయి. చెన్నై కరోనా కోరల్లో విఅప్రీత స్థాయిలో చిక్కుకోవడంతో రాజధాని మార్చాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే చెన్నైలో ఈ రాజధాని మార్పు ప్రతిపాదన ఇప్పటిది కాదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే అప్పటి ముఖ్యమంత్రి ఎంజిఆర్ రాష్ట్ర రాజధానిని చెన్నై నుండి తిరుపతికి తరలించాలని ప్రయత్నించారు.
అప్పుడలా…. ఇప్పుడిలా….
ఆ తర్వాత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేశారు. సబ్బరన్ ప్రాంతాలను చెన్నైలో కలిపి శాటిలైట్ నగరాన్ని నిర్మించాలని కరుణానిధి అనుకున్నారు. అయితే ఎంజీఆర్, కరుణానిధి ప్రయత్నాలపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడేమో మేధావులు గతంలోనే రాజధానిని మార్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు
సెంటిమెంట్లే అసలు సమస్య
ఇక ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల తమిళనాడులో రాజధాని మార్పు కారణమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే చెన్నై అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు మద్రాసు ఉరఫ్ చెన్నై. వారిని తమిళులు, తమిళనాడు వాసులు అని అనడం కంటే మదరాసీయులు, చెన్నై వాసులు అని అనే వారే ఎక్కువ. వారికి అదే గుర్తింపు కూడా. అసలే చెన్నై వాసులకి ఇలాంటి సెంటిమెంట్లు, భావోద్వేగాలు, ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై నుండి రాష్ట్ర రాజధాని మార్చడం అంటే ప్రభుత్వానికి కత్తిమీదసామే.