అగ్ర దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి మరియు అతని కుటుంబం కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెల్సిందే. జులై 30న ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేసారు. ఈ వార్త తెలియగానే అందరూ కంగారుపడ్డారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెండు వారాల తర్వాత తాము కరోనా నుండి కోలుకున్నట్లు ప్రకటించారు రాజమౌళి.
“రెండు వారల క్వారంటైన్ తర్వాత మాలో ఎటువంటి లక్షణాలు లేవు. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయించాం. నాతో పాటు కుటుంబసభ్యులందరికీ కరోనా నెగటివ్ వచ్చింది. అయితే మాలో యాంటీ బాడీస్ వృద్ధి చెందడానికి మూడు వారాలు ఎదురుచూడాలని వైద్యులు చెప్పారు. అప్పుడే మేము ప్లాస్మా దానం చేయగలం” అని వివరించారు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!