తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాగా సెంటిమెంట్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. అనేక యాగాలు, హోమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురించి ఆలోచన చేస్తూ మరోపక్క పరిపాలన కూడా అదే రీతిలో ఉండేలా చూసుకుంటారు. ఇందువల్లే తాజాగా కడుతున్న కొత్త సచివాలయం కూడా వాస్తు తనకి, తన కుటుంబానికి అనుకూలంగా ఉండేటట్లు కేసిఆర్ నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా తాను దేశంలోనే కరుడుగట్టిన హిందువుని అంటూ పలు మార్లు కేసీఅర్ మీడియా ముందు చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల ప్రగతి భవన్ లో వినాయక చవితి పండుగ రోజు నాడు కేసిఆర్ మనవడు హిమన్ష్ పూజ చేయడం జరిగింది. ఈ పూజకు టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు అదేవిధంగా కేసీఆర్ సతీమణి ఆమె కోడలు శైలి మరియు ఎంపీ సంతోష్ తో పాటు మరికొంత మంది హాజరయ్యారు.
వినాయక పూజలో కేసీఆర్ మనవడు హిమాన్ష్….. పూజ చేయటం హైలెట్ గా నిలవడంతో పాటు సేమ్ వాళ్ళ తాత గారిని భక్తిశ్రద్ధలు విషయంలో దింపేశారట. తాత కేసీఆర్ మాదిరిగానే మనవడు హిమాన్ష్…. దండం పెట్టడం అంతా డిట్టో దిగిపోయిందట. చాలా మంది పార్టీ నేతలు ఆధ్యాత్మిక విషయంలో కేసిఆర్ అసలు సిసలైన వారసుడు హిమాన్ష్….. అని అంటున్నారట.