ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుశాంత్ మృతి గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుశాంత్ గురించిన చర్చలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖులు కూడా సుశాంత్ మృతి విషయంలో తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితం ఎలా అయిపోయిందో కళ్ళారా చూశానంటూ ఇటీవల సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సుశాంత్ మృతి కి సంబంధించి ఏ చిన్న వార్తయిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 2016 వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సుశాంత్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని అంకిత తెలిపింది. ఇద్దరు 6 ఏళ్ళు ప్రేమించుకున్నారని పెళ్ళి చేసుకుందామనుకున్న సమయంలో ఇద్దరి మద్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం తో విడిపోయినట్టు అంకిత వెల్లడించింది.
సుశాంత్ కి దూరమైన అంకిత కుశాల్ టాండన్ తో సన్నిహితంగా ఉందన్న టాక్ వచ్చింది. ఇక సుశాంత్ మృతి.. రియా.. మళీ సుశాంత్, అంకిత కలుస్తున్నట్టు చెప్పిన మాటలని అంకిత ఖండించింది. కాగా సుశాంత్ కి దూరమైన అంకిత కుశాల్ టాండన్ తో డేటింగ్ చేస్తుందని ఒక మీడియా రాసుకొచ్చింది. ఇది చూసిన కుశాల్ టాండన్ కి కాలిపోయింది. మొత్తం మీడియా వ్యవస్థనే ఏకిపారెశాడు. నాకు సుశాంత్ సోదరుడితో సమానమని …అంకిత కూడా నాకు మంచి స్నేహితురాలు తప్ప మా ఇద్దరి మద్య అంతకు మించి ఏమీ లేదని..క్లారిటీ ఇచ్చాడు. అనవసరంగా ఈ వ్యవహారంలోకి నన్ను లాగొద్దంటూ తెలిపాడు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!