NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రెవెన్యూ శాఖపై జగన్ మార్కు…! అవినీతి కట్టడికే…!!

 

ఏ ప్రభుత్వానికి అయినా మంచి పేరు ఎప్పుడు వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో నయా పైసా తీసుకోకుండా అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తినపెట్టుకుంటారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని మాత్రం రూపుమాపలేకపోతున్నారు. అవినీతిలో అధికారులకు ఎంత పాత్ర ఉందో, ప్రజలకు అంతే మొత్తంలో బాధ్యత ఉంటుంది. తమ పనులు త్వరగా జరగాలని కొందరు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులు చేయించుకునేందుకు మరి కొందరు అధికారులకు ముడుపులు ఇస్తూ వారిని లంచావతారులుగా తయారు చేస్తున్నారు. ఒక సారి అవినీతికి అలవాటు పడిన తరువాత సదరు ఉద్యోగులు ఏ పనులకైనా డబ్బులు ఆశించడం రివాజుగా మారుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో అధికారులు పట్టుబడుతుండటం, అక్రమ ఆస్తులు గుర్తించడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల తెలంగాణలో కోటి రూపాయల అవినీతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే దీనిపై ఒక ప్రకటన చేశారు. అవినీతి రహిత పరిపాలన అందించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి అనేది ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు సైతం అక్రమ కార్యక్రమాలకు సిఫార్సులు చేస్తే వినాల్సిన పని లేదని కూడా అధికారులకు సూచించారు. అధికారులు అందరూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. సి ఎం జగన్ చేసిన ఆ హెచ్చరికల తరువాత కొద్ది నెలల పాటు దిగువ స్థాయిలో కొంత మేర అవినీతి తగ్గింది. అయితే రానురాను కొందరు ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్కడక్కడా ఇసుక, మట్టి, సున్నపురాయి, గ్రావెల్ అక్రమ రవాణాకు తెరలేపడంతో అధికారులు కూడా వారికి అందింది తీసుకుంటూ సహకరించడం మొదలు పెట్టారు.

ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న కార్యాలయాల్లో అవినీతి జరగకుండా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భావిస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ ముందుగా రెవెన్యూ శాఖపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని తహశీల్దార్ కార్యాలయాలను ఎంచుకొని అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు తనిఖీలు చేపట్టారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా ఏసిబి అధికారులకు రెండు లక్షల 40 వేల రూపాయలు దొరికాయి. అదే విధంగా జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో కార్యాలయానికి సంబంధం లేని నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా విజయవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ రెవెన్యూ కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు ఎసిబి అధికారులు. ఈ ఆకస్మిక తనిఖీలతో రెవెన్యూ ఉద్యోగులకు ఒక భయం ఏర్పడింది. ముందుగా రెవెన్యూ శాఖతో పాటు పోలీస్, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను అవినీతి రహిత శాఖలుగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk