తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తర్వాత బెయిల్ పై విడుదలైనా కోవిద్ నిబంధనలను ఉల్లఘించడంతో పాటు ఎస్సీ పోలీసుపై దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో తర్వాతి రోజు మళ్ళీ అరెస్ట్ చేసిన వ్యవహారం తెల్సిందే.
అయితే ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. మెరుగైన వైద్యం అందించడం కోసం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన కరోనా నుండి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాంతో పాటు అరెస్టైన కేసు వివరాల గురించి కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.