ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన పెందుర్తి శిరోముండనం కేసులో ప్రముఖ విశ్లేషకులు, సినీ నిర్మాత నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన కర్ణాటకలోని ఉడిపి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు.
శిరోముండనం కేసు వెలుగుచూసినప్పటి నుండి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడు. అరెస్ట్ చేసాక కోర్టులో హాజరు పరిచినట్లు సీపీ వెల్లడించారు. శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేయడంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియ, వారి సహాయకులు వరహాలు, ఇందిరా, ఝాన్సీ, బాలు, సౌజన్య, రవిలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఉడిపి నుండి ముంబై పారిపోవడానికి నూతన్ నాయుడు ప్రయత్నిస్తుండగా తాము అరెస్ట్ చేసినట్లు సీపీ తెలియజేసారు.