ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మన దేశం మొత్తం గర్వించ హీరోగా డార్లింగ్ ప్రభాస్ పేరు సాధించాడు. ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 300 కోట్ల పైనే బడ్జెట్ కేటాయిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా ప్రభాస్ నటించబోతున్న “ఆదిపురుష్” తయారవబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చింది రెండు కర్ఫర్మేషన్స్ మాత్రమే. ఒకటి టైటిల్ తో కూడిన పోస్టర్.. ఇంకోకటి విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన ప్రకటన.
కాని సినిమా మీద మాత్రం ఊహలకు మించి బజ్ క్రియోటయింది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాని ఎంతో ప్రిస్టేజియస్ సినిమాగా భావిన్నారు. అందుకే భారీ విజువల్స్ తో ఉన్నత ప్రామాణికాలతో “ఆదిపురుష్” తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎంత భారీ కాన్వాయిస్ తో రూపొందిన సినిమా అయినప్పటికి అందుకు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఆర్ ఆర్ ఎఫెక్ట్ లేకపోతే మూకీ సినిమాగా అనిపిస్తుంది. విజువల్ గా సినిమా ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా అందుకు తగ్గట్టుగా కానీ సౌండింగ్ స్కోర్ ఉంటే ఆ చిత్రం మరో స్థాయికి చేరుకుంటుంది. అందుకు ఉదాహరణగా రాజమౌళి తీసిన బాహుబలి సినిమా గురించి చెప్పొచ్చు.
కాబట్టే గ్రాండియర్ మ్యూజిక్ ను ఇచ్చే సంగీత దర్శకుల పేర్లను ఓం అరుత్ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మన తెలుగు ప్రేక్షకులు తమ అభిప్రాయాలని తెలుపుతూ ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అయితే సినిమా స్థాయి పెరుగుతుందని చెప్పుకొస్తున్నారట. బాహుబలి సినిమాకి కీరవాణి అందించిన సంగీతం ప్రధాన పాత్ర పోషించింది.
అలాగే ఇప్పుడు తాజాగా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ కి మోషన్ టీజర్ వీడియో కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా గ్రాండ్ గా అనిపించిందని అందరు అభిప్రాయపడ్డారు. కాబట్టి కీరవాణి ఇలాంటి ఇతిహాస గాథను మోయగలిగే సత్తా ఉన్నవారిని టాలీవుడ్ తరపున సినీ ప్రేమికులు ఆదిపురుష్ టీం కు సూచిస్తున్నారు. కాగా ప్రస్తుతానికి ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.