వాస్తవంగా చెప్పాలంటే ఈ సీజన్ బిగ్ బాస్ కు హైప్ ఇచ్చేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నాలు మరే సీజన్ లో చేయలేదు. మామూలుగానే ఈసారి వచ్చిన కంటెస్టెంట్ లపై ముందు నుండి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. కాబట్టి నిర్వాహకులు ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. అందులో భాగంగానే వరుసగా ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లను ప్రవేశపెట్టారు కానీ అవి అంతగా వర్కవుట్ కాలేదు.
అవినాష్ తప్పించి మిగిలిన ఇద్దరు ఇంటిముఖం పట్టారు. టాస్కుల్లో కూడా కొత్తదనం లేదు. ఇక ట్విస్తులు ఇచ్చే లోపు లీక్ అయిపోతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కంటెస్టెంట్ లు అనారోగ్యానికి గురి కావడం మరొక పెద్ద దెబ్బ. భుజం గాయం వల్ల అభిజిత్ ఫిజికల్ హాస్టల్లో పాల్గొనలేదు. ఈ సీజన్లో కూడా ప్రేక్షకులను అలరించిన టాస్క్ ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి.
ఇలాంటి సమయంలో కుమార్ సాయి రీ ఎంట్రీ వార్త అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. పదకొండవ వారంలో ఎలిమినేట్ అయిన కుమార్ సాయి ఈ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. ఇంట్లో తప్పుడు ఎలిమినేషన్ జరుగుతోందని ఆరోపించారు. ఇక అఖిల్ సీక్రెట్ రూమ్ ప్లాన్ తాజాగా బెడిసికొట్టింది. జనాల్లో అదేమి ప్రభావం చూపలేదు కాబట్టి కుమార్ సాయి ఇంట్లోకి ప్రవేశపెట్టేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గత సీజన్లో కూడా 11వ వారం లో అలీ రెజా రీ ఎంట్రీ ఇచ్చాడు. చివరికి తన ఫైనలిస్టుల జాబితాలో కూడా నిలిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్. ఇక నెటిజన్లు చేసిన కామెంట్స్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ అతను లోనికి వస్తే మాత్రం ఆట యూటర్న్ తిరుగుతుంది…. షో లో కొత్త ట్విస్టులు ఖచ్చితంగా వస్తాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!