చేసే పనికి ప్రశంస, గుర్తింపు దక్కితే వచ్చే ఆనందమే వేరు. పనిచేసే వారికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లే. ఇంకా ఫుల్ ఎనర్జీతో పని చేయడానికి సంకల్పిస్తారు. అది ఏ రంగం అయినా కావచ్చు. సినిమా రంగం విషయానికి వస్తే, తమిళ నాడు ప్రభుత్వం అందించే కలైమామిణి అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. కొన్ని కారణాలో పెండింగ్లో ఉన్న ఈ అవార్డ్స్ను 2011-18 వరకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. సినీ రంగంలో హీరోలు కార్తి , విజయ్ సేతుపతిలతో పాటు కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా, సీనియర్ డైరెక్టర్ సురేష్ కృష్ణ, నిర్మాత ఎ.ఎం.రత్నం, యువన్ శంకర్ రాజా, రత్నవేలు, డైరెక్టర్ హరి, ప్రియమణి, కమెడియన్ సంతానం తదితరులకు ఈ అవార్డ్ దక్కింది. న్యూస్ ఆర్బిట్ తరపున అవార్డ్ను పొందిన వారికి అభినందనలు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!