NewsOrbit
రాజ‌కీయాలు

చిక్కుల్లో చైనా..! హైడ్రో ప్రాజెక్టుతో ఒంటరిగా మిగిలే అవకాశం..!!

china under trouble with hydro power project

చైనాకు దక్షిణ సరిహద్దులో భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న యార్లంగ్ జాంగ్బో నదిపై హైడ్రోపవర్ ప్రాజెక్టు కట్టాలని భావిస్తోంది. అయితే.. దీనిని భారత్ వ్యతిరేకిస్తోంది. ఇది భారత్ లోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. భౌగోళికంగా చైనా ఎదుగుదలకు, భారత్ లోని నది పరిసర ప్రాంతాల్లో నీటి లభ్యతపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య నీటి పంపకాలపై ఒప్పందాలు ఉన్నాయి. కొన్ని వివాదాలు కూడా ఉన్నయి. కానీ.. ఇదే తరహా ఒప్పందానికి చైనాతో భారత్ విముఖంగా ఉంది.

china under trouble with hydro power project
china under trouble with hydro power project

చైనా ఉద్దేశం ఇదీ..

నిజానికి యార్లంగ్ జాంగ్బో నదిపై చైనా ప్రాజెక్టు కట్టాలని దశాబ్దాలుగా భావిస్తోంది. అయితే.. భారత్ నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో ఇన్నాళ్లూ సైలంట్ గానే ఉంది. ఈ ప్రాజెక్టు కడితే భారీస్థాయిలో అక్కడ విద్యుత్ జనరేట్ చేస్తుంది. సరిహద్దు ప్రాంతంలో ఇది చైనాకు మరిం బలం చేకూరుస్తుంది. దీనివల్ల చైనా నిర్దేశించుకున్న 2060 కార్బన్ న్యూట్రల్ గోల్ ను చేరుకోగలదు. ఈ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం వల్ల ఇతర దేశాలకు విద్యుత్ ను విక్రయించే ఉద్దేశం కూడా చైనాకు ఉంది. ఇప్పటికే నేపాల్ కు హై ఓల్టేజి ట్రాన్స్ మిషన్ లైన్స్ కూడా వేసింది. చైనా హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే పొరుగు దేశాలకు భారీగా విద్యుత్ ను అందించగలదు. ఇది ఆయా దేశాలకు ఎంతో ఉపయోగం కూడా. అయితే..  ఈప్రాజెక్టు వల్ల ఈ నదికి దిగువున్న ఉన్న దేశాల నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై చైనా తన పొరుగు దేశాలతో ఇప్పటికే స్నేహపూరిత సంబంధాలు ఏర్పరచుకున్నాయని అంటున్నారు.

చైనాకు ఒంటరిగా మిగిలేనా..?

అయితే.. ఈ ప్రాజెక్టు వల్ల భారత్ రక్షణ, భద్రతాపరమైన అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల రెండు దేశాల మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల నదికి దిగువన ఉన్న భారత్ లోని నగరాలు వరద ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటోంది. భౌగోళికంగా ఇది భారత్ కు దెబ్బ అని అంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా విదేశీ వ్యవహారాలపై ఇలాగే ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సొంత దేశంలోనే వ్యతిరేకతకు గురై నష్టపోయాడు. చైనా కూడా ఇదే పద్ధతిని  అవలింబిస్తూ విదేశీ సంబంధాలపై దెబ్ తీసుకునేలా వ్యవహరిస్తోంది. ఇదే నియంతృత్వ ధోరణితో వెళ్తే విదేశీ వ్యవహారాల్లో చైనా ఒంటరిగా మిగిలిపోతుంది. ఏ దేశానికైనా విదేశాలతో సఖ్యత ఎంతో అవసరం. సున్నితమైన ఈ అంశాన్ని చైనా జటిలం చేసుకుంటుందనే చెప్పాలి.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?