కరోనా దెబ్బకు అప్పట్లో అంతర్జాతీయ విమాన రాకపోకల సర్వీసులను తగ్గించే చేసిన కేంద్ర ప్రభుత్వం తరువాత క్రమ క్రమంగా పెంచుకుంటూ పోతుంది. కరోనా లాక్డౌన్ సమయం లో దాదాపు ఆరు నెలల పాటు రద్దయిన అంతర్జాతీయ సర్వీసులను మే 25న తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా స్వదేశీయులు ఎక్కడైతే ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని పోయారో వారిని స్వస్థలాలకు తేవడానికి వందే భారత్ మిషన్ పేరిట సర్వీసులను స్టార్ట్ చేసింది.
ఆ తర్వాత 33% తో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జూన్ 26 నుంచి విడతలవారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా దాదాపు 80 శాతం పరిమితితో విమాన సర్వీసులను నడుపు కోవచ్చని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో 80% పరిమితితో విమానాలు ప్రయాణించడానికి నేటి నుండి రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే మరో పక్క ఇతర దేశాలలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గట్టిగా ఉంటున్న నేపథ్యంలో యూరప్ మరికొన్ని దేశాలలో ఆంక్షలు మళ్ళీ విధిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు విమాన ప్రయాణికులకు లాభం అవుతుందో చూడాలి.