ప్రముఖ సింగర్ సునీత ఎంగేజ్మ్ంట్ నిన్న ఉదయం జరిగిన విషయం మనకి విదితమే. చాలా రోజుల నుంచి సునీత ఉపద్రష్ట రెండో పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆ వార్తను నిజం చేస్తూ నిన్న ఉదయమే వివాహ నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆమె తెలుగు డిజిటల్ మీడియాలో ఓ బిజినెస్ మ్యాన్తో నిన్న ఉదయం తన కురుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నారు.
19 ఏళ్ల వయసులోనే సునీతకి మొదటి పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త తీరుతో విసిగిపోయిన సునీత ఇంక చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి పిల్లలు సునీత దగ్గరే పెరిగారు. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె తన పిల్లల కోరినట్లుగా రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఆమె తెలుగు డిజిటల్ మీడియాలో ఓ బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆయన పేరు రామ కృష్ణ వీరపనేని. ఆయనకు ఇది వరకే పెళ్లయింది కానీ చాలా కాలం క్రిందటే విడాకులు తీసుకున్నారు.
అసలు వీళ్లిద్దరికీ పరిచయం ఎప్పుడు అని చాలా మందికి ఉన్న సందేహం. అయితే ఒక ఆడియో ఫంక్షన్ లో వీళ్లు మొదటి సారి కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. మ్యాంగో సంస్థలో సునీత ఒక ఆల్బం రికార్డింగ్ కూడా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక సునీతకు కుమార్తె శ్రేయ గోపరాజు మరియు కుమారుడు ఆకాష్ గోపరాజు ఉన్న సంగతి తెలిసిందే. సునీత కూతురు ఇప్పటికే సింగర్ గా ఇండస్ట్రీ లో రాణించింది. తన వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకున్న అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.