పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ముఖ్యపట్టణం ని ఒక వింత వ్యాధి అతలాకుతలం చేస్తుంది. అది ఎందువల్ల వచ్చింది అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. వ్యాధికి మూల కారణం తెలుసుకోవడానికి ఇప్పటికే కేంద్ర బృందాలు అదేవిధంగా డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు కూడా ఏలూరు పట్టణానికి చేరుకోవడం జరిగింది.
కేవలం మూడు రోజుల వ్యవధిలో 500కు పైగా కేసులు రావడంతో ఏలూరు నగర వాసులు భయాందోళనలు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనారోగ్యానికి గల కారణాలు వెతికే విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. శనివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ వింత వ్యాధికి గల కారణం ఏమై ఉంటుంది అన్నది ఇంకా తేలలేదు.
ఇదిలా ఉండగా సోమవారం వచ్చేసరికి ఈ అనారోగ్య లక్షణాలు మరోలా మారిపోయాయి. మొదటిలో ఈ వింత వ్యాధి వచ్చిన వారికి లక్షణాలు సోమవారం నుండి కనబడటం లేదట. శని.. ఆదివారాల్లో నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి వాంతులు.. నోటి నుంచి నురగ లాంటివి రాలేదు. సోమవారం నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి వాంతులు.. విరేచనాలు.. నురగలు కక్కటం.. మూర్ఛ తదితర లక్షణాలతో బాధ పడ్డారు. మూర్ఛతో పడిపోయినప్పుడు.. ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నప్పుడు కొందరి నోటి నుంచి రక్తం రావటం గమనార్హం. మొదటి రెండు రోజులు లేని ఈ కొత్త లక్షణం ఇప్పుడు పలువురిని టెన్షన్ కు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ వ్యాధి రావటానికి గల కారణం ఎక్కువ నీటి కాలుష్యం అని నగర వాసులు చెప్పుకొస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఫలానా కారణం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్న విషయాన్ని ఏది కూడా చెప్పటం లేదు. ఏది ఏమైనా ఏలూరులోని వచ్చిన వింత వ్యాధి మొదటి రెండు రోజులు లక్షణాలు ఒకలా ఉంటే.. మూడో రోజు లక్షణాలు మారిపోవటం అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.