అంతుచిక్కని వ్యాధి ఏలూరు నగరాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎక్కడ ఉన్న వారు అక్కడే పడి పోతూ ఉండడంతో నగర వాసులు భయాందోళనలు గురవుతున్నారు. ఇప్పటికే ఈ వింత వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సమీక్ష చేయగా తాజాగా కేంద్ర ప్రభుత్వ బృందాలు సీన్ లోకి ఎంటర్ అవబోతున్నాయి.
ఇలాంటి తరుణంలో ఏలూరు వింత వ్యాధికి అదే కారణమంటూ గుట్టు బయట పెట్టింది ఢిల్లీ ఎయిమ్స్. ఏలూరు వాసులు ఈ వింత వ్యాధికి గురవడానికి బార లోహలం అని ఢిల్లీ ఎయిమ్స్ బృందం బయటపెట్టింది. పేషెంట్ల రక్త నమూనాలను పరిశీలించిన వైద్య బృందాలు ఈ సంగతిని ధృవీకరించారు. పేషెంట్స్ రక్త నమూనాల లో ప్రమాదకరమైన లెడ్ హెవీ మెటల్, నికెల్ అనే మెటల్ ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు.
రక్తంలో లెడ్ పరిమాణం పెరిగితే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనబడతాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇది తాగునీటి ద్వారా లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలోకి వెళ్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పరిశీలించిన శాంపిల్స్ వివరాలను మంగళగిరి ఎయిమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. అయితే ఏ మార్గం ద్వారా ప్రజలలోకి ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో వాటర్ మరియు పాల శాంపిల్స్ కూడా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ఎయిమ్స్ బృందం కోరింది. మరోపక్క ఏలూరులో ఈ వింత వ్యాధి వచ్చిన వారిలో కొత్తకొత్త లక్షణాలు బయట పడటం వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. శనివారం ఆదివారం లక్షణాలు ఒకలా ఉంటే తర్వాత లక్షణాలు మరోలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.