ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పట్ల చాలావరకూ ప్రజలలో సానుకూలమైన వాతావరణమే ఉందన్న టాక్ ఎప్పటి నుండో ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పాలన అందిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
అదే రీతిలో సంక్షేమ పథకాలు డైరెక్టుగా లబ్ధిదారుల ఇంటికి చేరుతున్న తరుణంలో.. ఉన్న కొద్దీ వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో విశ్వాసం నెలకొంటుంది అనే వాదన ఏపీ రాజకీయవర్గాలలో వినబడుతుంది. వచ్చిన ఏడాదిలోనే దాదాపు మేనిఫెస్టోలో 90 శాతానికి పైగానే వాగ్దానాలు నెరవేరుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ జగన్ ప్రభుత్వానికి చాలా బెనిఫిట్ గా మాత్రమే కాక ప్రజలలో మంచి గుర్తింపును తెచ్చుకున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఇటీవల ఓర్మాక్స్ అనే ప్రముఖ సంస్థ దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం ఎవరు అంటూ సర్వే చేసి వచ్చిన ఫలితాలను బట్టి ర్యాంకులను కేటాయించడం జరిగింది. ఈ క్రమం లో ఓర్మాక్స్ చేసిన సర్వే లో ఏపీ సీఎం జగన్ దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం గా నాలుగో స్థానం దక్కించుకున్నారు. ఫస్ట్ ప్లేస్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉండగా సెకండ్ ప్లేస్ లో శివరాజ్ చౌహాన్ ఉన్నారు. మూడవ స్థానంలో కేజ్రీవాల్ ఉండగా నాలుగో స్థానంలో జగన్ నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సర్వేలో 15వ స్థానంలో ఉన్నారు. దాదాపు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు ప్రముఖ మ్యాగజైన్ లు చేస్తున్న సర్వేలలో టాప్ ఫైవ్ లోనే ఉంటూ పరిపాలన అందిస్తూ ర్యాంకులు సాధించటం గమనార్హం.