చేపల వ్యాపారం మార్కెట్లోనే జరగాలి… లైవ్ ఫిష్ … ఫైవ్ ఫిష్ అని పిచ్చి పిచ్చి కథలు పడితే చేపలతొట్టెలో వేసి పిసికేస్తాం.. ఏందిరా చూస్తా ఉంటె వీధికో ఫిష్ మార్కెట్ చేస్తున్నారు.వచ్చి వచ్చి మా బతుకులు మీద పడతారు అంటూ కొత్తరకం ధర్నా ఏలూరులో జరిగింది…
ఏలూరు లో ఎక్కడ పడితే అక్కడ చేపల వ్యాపారం మొదలు పెడుతున్న వారిపై చేపలమార్కెట్ లో వ్యాపారం చేసుకుంటున్న మహిళలు మండిపడ్డారు. సందుకో లైవ్ ఫిష్ అంటూ వ్యాపారాలు తెరుస్తున్నారని, దీనివల్ల ఏలూరు పెద్ద చేపల మార్కెట్ కు వినియోగదారుల తాకిడి తగ్గిందని… ఇలా అయితే ఎలా బతికేది అంటూ మార్కెట్ లో వ్యాపారం చేసుకునే మహిళలు అంత మంగళవారం కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. వెంటనే వీధి వెదికి వెలిసిన లైవ్ ఫిష్ కౌంటర్లను తీయించకుంటే అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని, చేపల వ్యాపారం చేపల మార్కెట్లోనే జరిగిలే చొరవ చూపాలని కలెక్టర్ ను కోరారు…. ఏలూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారని. అలా చేయడం వల్ల మార్కెట్లో చేపలు కొనేందుకు ఎవరూ రావడం లేదని. దీని వలన గత ఆరు నెలల నుండి మాకు ఎటువంటి వ్యాపారాలు లేవని. లైవ్ ఫిష్ వ్యాపారం అంటూ మా పొట్ట కొడుతున్నారని. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏలూరు మార్కెట్ చాపల వ్యాపారస్తులు ధర్నాకు దిగారు..?.
ఈ కొత్త రకం సమస్యకు ఎలాంటి దారి వెతకలో కలెక్టర్ ముత్యాలరాజుకు అంతుబట్టని పరిస్థితి…. దింతో ఆయన తలాసర్ది చెప్పి పంపించారు మరి…