మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి. తాను ప్రేక్షకుల మధ్య ఉన్నాను అన్న విషయం మర్చిపోయి సాధారణ వ్యక్తి లాగా సెలబ్రిటీ అనే ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతో హృదయపూర్వకంగా మాట్లాడే స్వభావం ఆయనది. ఏడు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన చిరు తాజాగా ‘సామ్ జామ్’ టాక్ షో లో పాల్గొని అందరినీ అలరించారు. మొన్న బిగ్బాస్ లో తనదైన శైలిలో వాక్చాతుర్యం ప్రదర్శించిన చిరు సమంత హోస్ట్ గా వస్తున్న ఈ టాక్ షో లో పాల్గొన్న ఎపిసోడ్ హైలైట్స్ ఇవే…
చిరు తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సక్సెస్, ఒడిదుడుకులు చెప్పి ఆడియన్స్తో ఆహా అనిపించుకున్నారు.
తను ఒక సినిమా చూసేటప్పుడు బాగా ఏడ్చినట్లు… అయితే కన్నీరు తుడుచుకోవడానికి కర్చీఫ్ బదులు పక్కనే ఉన్న హీరోయిన్ మంజుభార్గవి చీర కొంగుని వాడితే అప్పుడే థియేటర్స్ లో లైట్స్ ఆన్ చేశారని… అంతా ఆ దృశ్యాన్ని చూశారు అని చెప్పాడు. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో అంటూ నవ్వేశాడు మెగాస్టార్.
ఆ సినిమాకు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చిందని… అప్పటికీ తనకు పెళ్లి కాలేదు అని చెప్పిన చిరంజీవి హీరోయిన్ చీర కొంగును నా చేతిలో చూశారు కాబట్టి పెళ్లి నిశ్చయం అయిన తర్వాత సురేఖ అస్సలు ఒప్పుకోదు అని అనుకున్నట్లు చెప్పాడు. అయితే ఆమె ఒప్పేసుకుంది అని ముసి ముసి నవ్వులు నవ్వారు.
తన సినిమాలను మళ్లీ అదే పాత్ర పోషించే సత్తా నేటి తరం హీరోలలో ఎవరికి ఉంది అంటే చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ పేర్లను చిరంజీవి తీసుకున్నారు. ఠాగూర్ ను పోషించగల సత్తా పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఉంది అని తెలిపారు. స్వయంకృషి సినిమా కోసం మాత్రం ఆయన ఎవరి పేరు చెప్పలేకపోవడం గమనార్హం
అంతేకాకుండా ఖైదీ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అదే దర్శకుడు, నిర్మాత తో కలిసి వేట సినిమా చేయడం… అది కాస్త బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో చాలా కుంగిపోయినట్లు తెలిపారు. ఇంట్లో దుప్పటి కప్పుకొని ఎంతగానో ఏడ్చినట్లు చిరంజీవి చెప్పారు.
ఇలా పర్సనల్ ప్రొఫెషనల్ అనే తేడా లేకుండా సమంతతో… ప్రేక్షకుల ముందు తన ముచ్చట్లు, అనుభవాలు అన్నీ పంచుకొని ‘సామ్ జామ్’ షో కి మరింత స్టార్ డం తెచ్చారు మెగాస్టార్ చిరంజీవి.