భారతదేశపు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పై 96 వ పుట్టినరోజును పురస్కరించుకుని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 6 రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది వ్యవసాయ దారుల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత కొద్ది రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులందరూ పార్లమెంటులో పాస్ అయిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
వాజ్ పయి పేరు మీద…
రైతులను శాంత పరిచేందుకు బిజెపి ప్రభుత్వం నానారకాలుగా ప్రయత్నిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుండి నిరసనకు పెద్దగా మద్దతు లేదు గాని ఉత్తరాదిలో మాత్రం ఈ కార్పొరేట్ బిల్లులపై రైతులంతా ఉక్కుపాదం మోపేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే కేంద్రం కూడా అంతే పట్టుదలగా ఉంది. ఇక తాజాగా జరిగిన మీటింగ్ లో మోడీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద 18 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో ఇది రెండవ విడత కావడం గమనార్హం. ప్రధానమంత్రి తాజాగా విడుదల చేసిన 18 వేల కోట్ల రూపాయలు ఆరు రాష్ట్రంలోని 9 కోట్ల రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరుస్తాయని చెబుతున్నారు.
వారు చెప్పేవి పచ్చి అబద్ధాలు
అలాగే ఇదే సమయంలో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కావాలని రాజకీయ లబ్ధి కోసం రైతులకు అబద్ధాలు చెప్పి రెచ్చగొడుతున్నారని అన్నారు. వారు చెప్పేవన్నీ రైతులను నమ్మవద్దని కోరారు. ఈ బిల్లు ద్వారా రైతులకు అధిక స్థాయిలో మేలు చేకూరుతుందని చెప్పారు. ఇక పీఏం కిసాన్ స్కీమ్ వస్తే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు లెక్కన చిన్న మరియు మార్జినల్ రైతులకు సహాయం అందించేందుకు ఈ స్కీంను ప్రవేశపెట్టారు. ఇక ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని మూడు విడతల్లో ఇస్తుంది. అటల్ బిహారీ వాజపేయి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ రెండవ ఇన్స్టాల్మెంట్ తో రైతులు శాంతిస్తారో లేదో చూడాలి.