తెలుగు సినిమా చరిత్రలో సావిత్రి తర్వాత తమ నటన, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ. ఈ జాబితాలో సౌందర్య మొదటి స్థానంలో నిలిచారు. అందంలో, నటనలో, అభినయంలో గాని సావిత్రి తర్వాతే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సౌందర్య మాత్రమే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. తెలుగులో గల స్టార్ హీరోలు అందరితోనూ ఆమె నటించారు. తాను ఒక స్టార్ హీరోయిన్ అయ్యి స్టార్ హీరోలతోనే కాకుండా బాబు మోహన్, అలీ వంటి కమెడియన్స్ తో కూడా ఆమె నటించారు.
సౌందర్య సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో కూడా ఆమె నటించి అందరి మెప్పు పొందారు. ఆవిడ నటించిన సినిమాలలో అమ్మోరు, రాజా, పవిత్ర బంధం, వంటి సినిమాలలో ఆమె నటన మనకి ఎప్పటికి గుర్తుండిపోతుంది.
సౌందర్య మొదట డాక్టర్ అవ్వాలనుకున్నారట. కానీ అనుకోని పరిస్థుతులలో ఆవిడ నటిగా మారి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సౌందర్య తన జీవితంలో ఎన్నో పాత్రలలో నటించారు కానీ ఆమె తన కలను నిజం చేసుకోలేకపోయారట. ఒక సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు దర్శకత్వం పై ఉన్న మక్కువను తెలియజేసారు.
తాను ఒక దర్శకురాలిని కావాలనుకుంటున్నాని, కనీసం ఒక్క సినిమాకైనా తాను దర్శకత్వం వహించాలనేది తన కల అని, అది ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాలని మాత్రం తన కోరిక అని ఆమె చెప్పారు.
“డైరెక్షన్ లో ఉండే ఆత్మసంతృప్తి, క్రియేటివిటీ అల్టిమేట్ అవుతుంది. నాకు నిర్మాతగా సంతృప్తి ఉన్నా గాని, డైరెక్షన్ చేస్తే ఆ సంతృప్తి వేరు. నా దగ్గర చాలా ఆలోచనలు, స్క్రిప్ట్ లు ఉన్నాయి మరియు వాటికి నేనే దర్శకత్వం వహించాలి. ఎందుకంటే మన ఆలోచనలను మన కంటే బాగా ఎవరు ప్రెజెంట్ చేస్తారు చెప్పండి. అందుకే నేను ఒక డైరెక్టర్ ని కావాలనుకుంటున్నాను” అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. కానీ తన కల నెరవేరకుండానే దివికి చేరుకున్నారు సౌందర్య.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!