రాశీఖన్నా ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల తర్వాత తెలుగులో మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ దక్కలేదు. మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండ తో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో భారీ డిసాజస్టర్ ని అందుకుంది. అంతే మళ్ళీ ఎవరు టాలీవుడ్ సినిమాలో అవకాశం ఇవ్వలేదు. కాని కోలీవుడ్ లో మాత్రం ఇప్పుడు రాశీఖన్నా బిజీ హీరోయిన్.
తమిళంలో వరసగా నాలుగు క్రేజీ సినిమాలు చేస్తోంది. అన్ని సినిమాలు భారీగా తెరకెక్కుతున్నాయి. ఈ నాలుగు సినిమాలలో కనీసం రెండు సినిమాలు సూపర్ హిట్ అయినా ఇక కోలీవుడ్ లో రాశీఖన్నా సెటిలైపోయినట్టే. ప్రస్తుతం తమిళంలో రాశీఖన్నా అరణ్మనై-3, మేధావి, తుగ్లక్ దర్బార్, సైతాన్ క బచ్చా సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలతో 2021 మొత్తం రాశీఖన్నా బిజీగా ఉండబోతోంది. అంతేకాదు మంచి క్రేజీ ప్రాజెక్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటానని అంటోందట.
కాగా రాశీఖన్నా కి బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు వారైన దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించే వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రాగా రాశీఖన్నా ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుందని సమాచారం. ఇప్పటికే రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మాన్ సీజన్ తో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 తెరకెక్కించగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ తర్వాత రాశీఖన్నా తో వెబ్ సిరీస్ మొదలవోతోందట.