Prabhas Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ ను ఒక స్టార్ హీరో గా నిలిపిన చిత్రం ‘వర్షం’. దివంగత దర్శకుడు శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం తో ప్రభాస్ కు అతి పెద్ద బ్రేక్ వచ్చింది. త్రిష హీరోయిన్ గా గోపీచంద్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా అప్పట్లో ఏ ఇండస్ట్రీ హిట్ అందుకుంది అన్న వార్తలు ఇప్పటికీ వస్తుంటాయి. ఇక ఈ సినిమాలో పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలిచాయి.
ఇక ఇటీవల ‘డర్టీ హరీ’ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు త్వరలోనే మరొకసారి ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పలువురు అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఎమ్మెస్ రాజు తాను త్వరలోనే మహేష్, ప్రభాస్ ల తో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పారు. మహేష్ కు ‘ఒక్కడు’, ప్రభాస్ కు ‘వర్షం’ సినిమాలకు నిర్మాతగా ఉన్న ఎమ్మెస్ రాజు ఇటీవల దర్శకుడిగా మారారు. అయితే ప్రభాస్ తో చేయబోయేది వర్షం సీక్వెల్ అని చెబుతున్నారు.
సలార్, ఆదిపురుష్ చేస్తున్న ప్రభాస్ దీనికి ఒప్పుకునేనా?
ఒక యువ దర్శకుడు అద్భుతమైన కథను సిద్ధం చేశాడని…. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రూపకల్పనలో ఎమ్మెస్ రాజు పాత్ర కూడా ఉంటుందని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ కు వినిపించనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు… పైగా అతను చేసేవి పాన్ ఇండియా సినిమాలు. ఇలాంటి సమయంలో ఒక యువ దర్శకుడికి మళ్లీ వర్షం మ్యాజిక్ రిపీట్ చేసేందుకు చాన్స్ ఇస్తాడో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఎమ్మెస్ రాజు చెప్పినట్లు వర్షం-2 ప్రాజెక్ట్ కనుక ఫిక్స్ అయితే డార్లింగ్ అభిమానులకు పండగే.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!