Ys Jagan Mohan Reddy : జగన్ సీఎం స్థానంలో కూర్చున్న తర్వాత చాలావరకు కులాలకు, మతాలకు అదేవిధంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అట్టడుగు స్థాయిలో ఉన్న కుటుంబాలలో మార్పు తెచ్చే పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా పేద వారి కుటుంబం పై పెనుభారంగా ఉండే విద్య, వైద్యం విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ “నాడు- నేడు” అంటూ “అమ్మఒడి” ద్వారా బతుకు భారం అనేది పేదవాళ్ల పై పడకుండా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఏ పేద వారి కుటుంబం చదువుకు దూరం కాకుండా సరికొత్త మార్పులు విద్యావ్యవస్థలో తీసుకురావటం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే సమాజంలో వెనుకబడిపోయిన కులాలుగా పేరొందిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలలో కూడా మార్పులు కలిగే రీతిలో జగన్ సర్కార్ సరికొత్త ఆలోచనలు తాజాగా చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ జగజ్జీవన్ పథకం కింద అందించడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ క్రమంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుకు ప్రభుత్వమే చెల్లింపు చేసే రీతిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22.44 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు..సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో ఉచిత ఇంటర్నెట్ కల్పించడానికి కూడా జగన్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.