Drishyam 2: 2013 వ సంవత్సరంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ సినిమా ‘దృశ్యం’. అప్పటిలో ఈ సినిమా కేరళ లోనే ఏకంగా 75 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా ని ఇతర బాషలలో కూడా రీమేక్ చేశారు. ఫలితంగా ఈ సినిమా అన్ని భాషలలోనూ ఘణ విజయాన్ని సాధించింది. మలయాళం లో మోహన్ లాల్ మరియు అలనాటి హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించగా తెలుగు లో విక్టరీ వెంకటేష్ మరియు మీనా ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే తమిళంలో కమల్ హాసన్ మరియు హిందీలో అజయ్ దేవగణ్ తో ఈ సినిమాను రీమేక్ చేశారు.
తాజాగా దృశ్యం 2 నేరుగా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి ఎక్కడ చుసినా ఈ సినిమా గురించే చర్చ.. ఈ సినిమా తెలుగు లో ఎప్పుడు రీమేక్ చేస్తారు అంటూ మరికొందరు కుతూహలం గా ఉన్నారు. అయితే ఈ చిత్రం మొదటి భాగంలో నటించిన వెంకటేశ్ మరియు మీనా లే మళ్ళి ఈ సీక్వెల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ చిత్ర సిబ్బంది అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని జీతూ జోసెఫ్ మళ్ళి తెలుగు లో కూడా రీమేక్ను డైరెక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారట.
ఇప్పటికే ఈ చిత్రాన్ని చుసిన ప్రేక్షకులు సోషల్ మీడియా లో దృశ్యం సీక్వెల్ మాస్టర్ పీస్ అంటూ తెగ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా కేవలం మలయాళం భాషలోనే విడుదల అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు సబ్ టైటిల్స్ తో చూస్తున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!