Allu arjun : అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ మిగతా భాషల్లో కూడా డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మన తెలుగు సినిమాలు దాదాపుగా ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, రవితేజ.. ఇలా మన స్టార్ హీరోల సినిమాలన్ని ఈతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా మన సినిమాలను చూసిన నార్త్ ప్రేక్షకులు మన స్టార్స్ కి అభిమానులుగానూ మారిపోతున్నారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులు మన తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తున్నారు.
ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా నార్త్ లో బుల్లితెర మీద రికార్డుల మోత మోగించింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన దువ్వాడ జగన్నాథం 2017లో విడుదలై హిట్ గా నిలిచింది. ఈ సినిమా.. మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నార్త్ లో సత్తా చాటడం విశేషం. రీసెంట్ గా డీజే భోజ్ పురి వెర్షన్ టీవీలో ప్రసారమై రికార్డు క్రియేట్ చేసింది. 39.83 లక్షల ఇంప్రెషన్స్ తో సత్తా చాటింది. అక్కడ ఇప్పటి వరకు బుల్లితెరపై అత్యధికంగా వీక్షించిన భోజ్ పురి సినిమా డీజే కావడం విశేషం.
Allu arjun : ఆగస్టు 13 న పుష్ప రిలీజ్..!
అంతేకాదు అక్కడ యూట్యూబ్ లో కూడా డీజే దుమ్ము దులిపేసింది. 326 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళుతోంది. ఇక ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 13 న పుష్ప రిలీజ్ అంటూ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.