Money Burn : లంచం తీసుకున్న వ్యక్తికి అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిస్తే ఏం చేస్తారు.. మహా అయితే లంచంగా తీసుకున్న డబ్బులు ఎక్కడో ఒక చోట దాచేందుకు ప్రయత్నిస్తారు.. వేరే వాళ్ళకి ఇచ్చి దాచి పెట్టమంటారు.. కానీ ఓ తాసిల్దార్ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 లక్షల రూపాయల డబ్బుల కట్టలను గ్యాస్ స్టవ్ మీద కాల్చేసాడు.. రాజస్థాన్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును తీసుకుంటూ రెవిన్యూ ఇన్స్పెక్టర్ పర్వత్ నూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించగా తన తప్పేమీ లేదని, తాసిల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను డబ్బులు తీసుకుంటున్నాం అని తెలిపాడు.. దీంతో పర్వత్ పట్టుకొని తాసిల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలుదేరారు..
ఈ విషయం తెలుసుకున్న తాసిల్దార్ లంచంగా తీసుకున్న డబ్బులు ఏం చేయాలో తెలియక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బులు కాల్చడం మొదలు పెట్టాడు. అతనికి తన భార్య కూడా డబ్బు కాల్చడంలో సహాయం చేసింది. ఏసీబీ అధికారులు ఇంట్లో రాకుండా తలుపులు గడియ పెట్టాడు. ఇలా మొత్తంగా రూ 20 లక్షల రూపాయల నోట్లను కాల్చేశాడు. ఏసీబీ అధికారులు అతని ఇంట్లో ఇంటికి చేరుకున్నారు. వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూసి డబ్బు కాల్చేద్దు అని హెచ్చరించారు. అయినా వారి మాటలను లెక్కచేయకుండా తాసిల్దార్ అదేపనిగా డబ్బులు కాల్చేస్తున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు తలుపులు బద్దలు కొట్టి తాసిల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. మొత్తానికి ఈ ఘటనలో 20 లక్షల రూపాయల కాలి బూడిద అవ్వగా.. కేవలం లక్ష రూపాయలు మాత్రమే అతడి నుండి స్వాధీనం చేసుకోగలిగారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
यह है पिंडवाड़ा के तहसीलदार कल्पेश जैन! एसीबी कार्रवाई करने पहुंची तब तहसीलदारजी घर के अंदर पैसों को जला रहे थे।@DineshMNIPS1 @RajCMO @Barmer_Harish @8PMnoCM pic.twitter.com/qEsdYKgLjs
— Dr. Ashok Sharma (@ashok_aajtak) March 24, 2021