Nivetha Thomas: పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో శృతిహాసన్ జతకట్టి, ఒక రొమాంటిక్ పాటలో సందడి చేసిన శృతిహాసన్ కి ఈ సినిమా హ్యాట్రిక్ మూవీ అని అందరూ భావించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత శృతి హాసన్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. శృతిహాసన్ స్థానంలో మరో నటి నివేథా థామస్ ఆక్రమించుకొని మంచి విజయాన్ని అందుకున్నారు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన శృతిహాసన్ కన్నా మరో కీలక పాత్రలో నటించిన నివేద థామస్ పాత్రకు ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.
చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న నివేథా పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమెలో ఏదో తెలియని వెలితి ఉండేది.వకీల్సాబ్ మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. గతంలో నివేథా పలు సినిమాలలో నటించినప్పటికీ ఏ సినిమాకి రాని క్రేజ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా సంపాదించుకున్నారు. ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను సంపాదించుకుంది.
నివేథాను సరైన స్థానంలో నిలబెట్టిన వకీల్ సాబ్:
నివేథా కెరియర్ మొదలు పెట్టిన ఎనిమిది సంవత్సరాలకు తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన “జెంటిల్ మెన్” చిత్రం ద్వారా పరిచయమై తన నటనకు మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఆమెలోని నటనను పసిగట్టి తిరిగి నాని సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాలో నటించారు. అదే విధంగా స్టార్ వేల్యూ ఉన్న జై లవకుశ, దర్బార్ వంటి సినిమాలలో నటించినప్పటికీ ఎలాంటి స్కోప్ రాలేదు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఫిమేల్ పాత్రలో చేసిన నివేథాకి ఈ సినిమా తనని కరెక్ట్ స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా ఆమె ఊపిరి పీల్చుకుందని ఫిలింనగర్ సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!