Pavan Kalyan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది.. డాక్టర్ల సలహా మేరకు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని.. ఎవరు ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు..
ఖమ్మం కు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతూ ఉన్నట్లుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వదిన శ్రీమతి సురేఖ తో పాటు రామ్ చరణ్, ఉపాసన లు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రం లోని చికిత్స కు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ పరీక్షిస్తున్న ట్లు తెలిపారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, సుబ్బారెడ్డి పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం, ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు.. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఆందోళన చెందవద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని తెలిపారు..