Kamal Hassan: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కథ కంచికి చేరుతున్నట్లే. వరుసగా ఆయన పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బై చెప్తున్నారు. తాజాగా పార్టీ కీలక నేత సీకే కుమరవెల్ పార్టీని వీడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “మేము చరిత్రను సృష్టించాల్సింది. కానీ, చరిత్రను చదువుతున్నాం’’ అని కమల్కు కుమార్వేల్ చురకలంటించారు.
ఈయనతో ఆరుగురు…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలువలేక పోయింది. దీంతో నేతలంతా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడుతో సహా కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్లోకి సీకే కుమారవేల్ చేరారు. ఈయనతో కలిపి పార్టీని వీడిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అంతకముందు MNM ఉపాధ్యక్షుడు ఆర్. మహేంద్రన్, ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
కమల్ గురించి ఏం కామెంట్లు చేశారంటే…
పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా ఉన్న సీకే కుమారవేల్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహత్మక బృందం తప్పుడు విధానాలను అవలంభించిందని ఆయన ఆరోపించారు. పార్టీ ఓటమికి నైతికంగా బాధ్యత వహిస్తూ MNMను వీడుతున్నట్లు కుమరవెలి చెప్పారు. ‘వ్యక్తిపూజకు ఆస్కారం లేదు. లౌకికవాద ప్రజాస్వామ్య రాజకీయాల్లో నేను ప్రయాణించాలనుకుంటున్నా.. మేము చరిత్రను సృష్టించాల్సింది. కానీ, చరిత్రను చదువుతున్నాం’’ అని కమల్కు కుమార్వేల్ చురకలంటించారు