Magunta Babu Family: ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మంగళవారం మృతి చెందారు.కొద్ది రోజుల క్రితమే మాగంటి బాబు పెద్ద కొడుకు కూడా మరణించడం తెలిసిందే.నెలల వ్యవధిలో ఇద్దరు కొడుకులు కోల్పోయిన మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
స్టార్ హోటల్లో రెండో కుమారుడు మృతి
మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మంగళవారం పార్క్హయత్ హోటల్లో రక్తపు వాంతులు చేసుకుని మరణించినట్లు సమాచారం.గత కొద్దికాలంగా రవీంద్రనాథ్ చౌదరి అనారోగ్యంగా ఉండటంతో ఆయన్ను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.ఆయన కరోనేతర వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది.అయినా ఆరోగ్యం కుదుట పడకపోవటంతో రవీంద్రనాథ్ చౌదరి హాస్పటల్ నుండి బయటకు వచ్చి పార్క్హయత్ హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నారని భోగట్టా! అయితే మంగళవారం అకస్మాత్తుగా రవీంద్రనాథ్ చౌదరి రక్తపు వాంతులు చేసుకున్నారని,దాన్ని గమనించిన హోటల్ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మరణించారని ఒక కథనం వినిపిస్తుంది.అయితే హోటల్ గదిలో రవీంద్రనాథ్ చౌదరి పడిపోగా సమాచారమందుకున్న కుటుంబసభ్యులు ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారని,అప్పటికే రవీంద్ర మరణించినట్టు వైద్యులు చెప్పారన్నది ఇంకో కథనం. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Prabhas: ఫుల్ హ్యాపీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..!!
3 నెలల క్రితమే పెద్ద కుమారుడు రాంజీ మృతి
ఈ ఏడాది మార్చి ఏడో తేదీన మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా మృతి చెందారు.ప్రమాదవశాత్తు ఆయన పడిపోగా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా మరణించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఒక లైంగిక వేధింపుల కేసులో రాంజీ ఇరుక్కోవడంతో ఆయన ఆత్మహత్యా ప్రయత్నం చేశారని ,ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై మాగంటి కుటుంబసభ్యులు స్పందించలేదు.ఘోర విషాదం జరగడంతో అంతటితో ఈ తరహా వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పడ్డాయి.ఇది జరిగి మూడు నెలలు కూడా కాకముందే మాగంటి బాబు రెండో కుమారుడు కూడా మృత్యువాత పడటం అత్యంత శోచనీయం. మహా విషాదకరం.