Lock down: దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ట్రెండ్ వలే తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2261 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోగా రికవరీ రేటు 99.5 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ సడలింపుపై శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
లాక్ డౌన్ ఎత్తేసే చాన్స్…
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివీటి రేటు 2 శాతానికి తగ్గిందని, బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్రమే ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వివరించారు. కేసుల తీవ్రత తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. లాక్డౌన్ గ్రామాల్లోనూ కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇప్పటి వరకు 87 లక్షలకు పైగా ఇళ్లలో రెండో దశ ఫీవర్ సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు. వచ్చే వారంలో కరోనా కేసులు తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
Read More: Lock down: లాక్ డౌన్ కేసీఆర్ పంట పండించిన మూడు అంశాలు ఏంటంటే…
బ్లాక్ ఫంగస్ తోనే సమస్య
గత పది రోజులుగా రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1100 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ తో పాటుగా జిల్లా కేంద్రాల్లోనూ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.