యువ కథానాయకుడు నితిన్ తదుపరి సినిమా సెట్స్లోకి వెళ్లకముందే మలి చిత్రాన్ని కూడా ప్రకటించాడు. హోలీ సందర్భంగా నితిన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించడం విశేషం. ఒకడున్నాడు, ప్రయాణం, ఐతే.. మనమంతా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా తెరకెక్కనుంది. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా భవ్య క్రియేషన్స్ బ్యానర్లో సినిమా రూపొందనుందట. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అలాగే త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` సినిమా ప్రారంభం కానుంది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు ప్రామిస్ చేసిన నితిన్ అన్నట్టుగానే సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
previous post
next post
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!