YSR: వైఎస్సార్ YSR వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేతగా తెలుగు ప్రజలు ఆయన్ను మరచిపోలేరు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, రుణమాఫీ.. పథకాలతో పాలనలో తనదైన మార్క్ చూపారు. ఆయన హఠాన్మరణం అభిమానుల్లో తీవ్ర వేదన మిగిల్చింది. ఏపీ సీఎంగా జగన్ ఎన్నికయ్యాక వైఎస్ అభిమానులు తమ నాయకుడిని జగన్ లోనే చూసుకుంటున్నారు. మొత్తంగా ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ, తెలంగాణలో వైఎస్ ను ప్రస్తావించే అవసరం కానీ.. ఆయన్ను మాటలు అనే పరిస్థితులు కానీ.. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాలేదు. కానీ.. ఇప్పుడు వైఎస్ ను తెలంగాణ నాయకులు దూనమాడుతున్నారు. వారి మనసుల్లో ఉండిపోయిన మాటలో.. ప్రస్తుత రాజకీయాల వల్లో కానీ.. తీవ్రంగానే విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈక్రమంలో తెలంగాణ నేతలు ఏపీ ప్రజలను, నేతలను.. చనిపోయిన వైఎస్ ను కూడా వదలడం లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘ఉద్యమంలో అంతమంది చనిపోవడానికి వైఎస్సే కారణం. పీజేఆర్ ను వైఎస్ అవమానించడం వల్లే గుండె ఆగి చనిపోయారు. వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదని.. ఇప్పటికీ ప్రజలు అనుకోవడం లేదా?’ అంటూ వైఎస్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మంత్రి ప్రశాంత్ కూడా వైఎస్ ను ఏపీ ప్రజలను కూడా తిట్టేశారు. ఇదంతా రాజకీయంగా కాక రేపుతోంది. అయితే..
Read More: YS Sharmila: షర్మిలకు కేసీఆర్ కౌంటర్..! సైలంట్ గా.. సిస్టమాటిక్ గా..!!
చనిపోయిన వైఎస్సార్ ను ఇప్పుడు తిట్టాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణాలు చూస్తే.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఆర్నెల్లుగా సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఆయన ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు ఉన్నపళంగా ప్రాజెక్టుల విషయం తీసుకొచ్చి.. మంత్రులతో వైఎస్ ను మాటలు అనిపించి.. ఇటు షర్మిలను.. అటు జగన్ ను రెచ్చగొట్టే ప్లాన్ వేశారని చెప్పాలి. తండ్రిని సమర్ధిస్తున్న షర్మిలను తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తిగా ప్రజల్లో చూపడం.. ఓ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇటు ఏపీతో కయ్యం కారణంగా కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తేవచ్చు. ప్రస్తుతం కేసీఆర్ అదే చేశారు. ఇదంతా చూస్తే.. రాజకీయాల కారణంగా వైఎస్ ను మధ్యలోకి తీసుకొస్తున్నారని చెప్పాలి.