YS Sharmila: వైఎస్ షర్మిల YS Sharmila తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణలోని వైఎస్ అభిమానులను ఏకం చేసి రాష్ట్రంలో తన మార్కు చూపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ నాలుగైదు నెలల్లో ఆమె కార్యకలాపాలు కొనసాగాయి. వచ్చే జూలై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఆమె పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. ఈక్రమంలో తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన మొదటి రోజు నుంచే ఆమె సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలంటూ కామెంట్లు చేశారు. ఇన్నాళ్లలో కేసీఆర్ ఆమెపై ఎటువంటి కామెంట్లు చేయలేదు. అయితే.. ప్రస్తుతం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను కేసీఆర్ ప్రస్తావించి ఆమెపై మాట్లాడకనే గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం కృష్ణా జలాల మళ్లింపు. ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇటివలి కేబినెట్ మీటింగ్ లో మండిపడ్డారు. కొందరు మంత్రులు సైతం శ్రీలంకలో అందరూ రాక్షసులే ఉంటారని వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ ను నీటి దొంగ అన్నారు. జగన్ ను గజదొంగ అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం ముదురి ఏపీ, తెలంగాణ మధ్య కాక రేపుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే.. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న షర్మిల ఈ అంశంపై ఇప్పటికీ కామెంట్ చేయలేదు. చెప్పాలంటే.. చేయలేకుండా కేసీఆర్ పరోక్షంగా చేశారని చెప్పాలి. ఎంతగా ఆమె తెలంగాణ రాజకీయాల్లో వేళ్లూనుకుంటున్నా.. ఏపీని విమర్శించే పరిస్థితి ఇప్పట్లో అయితే ఉండదు.
Read More: Narendra Modi: ఓ వైపు తిట్టుకుంటున్నా.., ఆ విషయంలో బైడెన్ ని మించిపోయిన మోడీ..!
కానీ.. అనేక సమస్యలపై స్పందిస్తున్న ఆమె కృష్ణా జలాల సమస్యపై స్పందించకపోతే.. తెలంగాణ ప్రజల్లో ఆమెపై అనుమానం రాకమానదు. నీటి అంశాన్ని వాడుకుని ప్రత్యేకంగా షర్మిలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కేసీఆర్ కు లేదు. అయితే.. ఈ అంశంపై షర్మిల ఏం మాట్లాడితే.. ఎటొస్తుందో అనే పరిస్థితి పరోక్షంగానే కల్పించారు. అన్న జగన్ ను మాత్రమే కాకుండా.. తండ్రి వైఎస్ ను సైతం నీటి విషయంలో తెలంగాణ నాయకులు మాటలు అంటున్నారు. దీంతో.. తండ్రి నిర్ణయాలను సమర్ధించలేరు.. ఖండించలేరు.. అన్న జగన్ ను కూడా మాటలు అనలేని పరిస్థితుల్లో షర్మిల ఉండిపోయారని చెప్పాలి. మరి.. కృష్ణా జలాలపై ముదురుతున్న విషయాలపై భవిష్యత్తులో షర్మిల ఏ టర్న్ తీసుకుంటారో చూడాలి.